Temperature1.5 Increase..భూతాప నియంత్రణలో విఫలం

Temperature Increase Global Warming

Temperature 1.5 వల్ల ముప్పు:

Temperature 1.5 మించదంతో కొత్త ప్రమాదంలోకి అడుగుపెట్టబోతున్నాం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం 15 డిగ్రీలకు మించకుండా చూసుకుందా మంటూ 2015లో ప్రపంచదేశాలు పారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని, ఆ పరిమితిని 2023లోనే దాటేశామని శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు. భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనపడుతోంది!

ఎండాకాలంలో మునుపెన్నడూ ఎరగని Temperature… వానాకాలంలో ముంచెత్తుతున్న వరదలు.. చలిదేశాల్లో నదులు ఎండిపోవడం.. ఎడారుల్లో వరదలు.. కార్చిచ్చు ఘటనలు పెరిగిపోవడం వంటి విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇకనైనా మానవాళి మేలుకుని భూతాపానికి చెక్ పెట్టే సమర్థమైన చర్యలు తీసుకోకపోతే ప్రమాద మని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.


భూమి సగటు Temperature 15 డిగ్రీలకు మించి పెరగకూడదని 2015లో పారిస్ ఒప్పందం
భూతాప నియంత్రణలో విఫలం అయ్యాము. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు
ఎండాకాలంలో భరించలేనంత వేడి, బయటి కెళ్తే నెత్తి మాడ్చేసేంత ఎండ చలికాలంలో భయంకరమైన చలి. వానాకాలంలో ఆనకట్టలు తెగిపోతాయేమో అన్నంత స్థాయిలో వరదలు… ఇదీ కొన్నేళ్లుగా పరిస్థితి!


Global Warming..Natural Calamities:


ఇటీవలికాలంలో ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధార ణంగా మారాయి. దీనికి కారణం.. భూతాపం. నానాటికీ పెరుగుతున్న భూ ఉపరితల Temperature ఉష్ణోగ్రతలు మాన వాళి మనుగడకే ప్రమాదకరంగా మారు తున్నాయి. మన భూమి సగటు ఉష్ణో గ్రత.. నాసా లెక్కల ప్రకారం 15 డిగ్రీలు. కానీ, పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోకి విడుద లయ్యే కర్బన ఉద్గారాలు, మానవ జీవనశైలిలో భారీ మార్పుల (ఏసీలు, ఫ్రిజ్ లు, జనరేటర్లు, ఇన్వ ర్టర్ల వంటివాటి వాడకం పెరిగిపో వడం) కారణంగా భూమి సగటు Temperature ఉష్ణో గ్రతలు గణనీయంగా పెరిగాయి. పారిశ్రావిక యుగం మొదలైన తర్వాత భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం మొదలై ఆ ప్రభావం ప్రకృతిపై పడింది.

దీనివల్ల హిమనీనదాలు, ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు భారీగా కరిగి ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టాలు పెరిగాయి. సముద్ర ఉపరితల Temperature ఉష్ణోగ్రతల్లో సైతం పెనుమార్పులు సంభవించి… రుతువులు గతి తప్పడం మొదలైంది. సకాలంలో వానలు కురవకపో వడం.. కురిస్తే కుంభవృష్టిగా ముంచెయ్యడం… ఎండాకా లంలో రికార్డుస్థాయి Temperatureఉష్ణోగ్రతలు నమోదు కావడం.. ఒక ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టి. ఇలా తీవ్రస్థాయి ప్రకృతి విపత్తులు భయపెడుతున్నాయి.

ఈ పరిస్థితిని ఊహించే.. ప్రపంచ దేశాల ప్రతినిధులు 2015లో దాదాపు రెండువారాలపాటు పారిస్లో సమా
వేశమై పర్యావరణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850-1900 నాటికి ఎంత ఉన్నాయో. దానికి Temperature 15 డిగ్రీలకు మించి పెరగకుండా చూసుకోవాలన్నది దాని సారాంశం. ఈమేరకు కర్బన ఉద్గారాలను దశలవారీగా తగ్గించు కునేందుకు ప్రపంచదేశాలకు వెసులు బాటు కల్పించారు. కానీ.. ఒక్క 2023లోనే ప్రపంచదేశాల చర్యలు భూతాపాన్ని 1.49 డిగ్రీల మేర పెంచాయని, ఇప్పుడు ఆ పరిమి తిని కూడా దాటేశామని లీడ్స్, లాంకస్టర్ వర్సిటీల పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.


Two Reasons..రెండు కారణాలు..


భూతాపానికి రెండు కారణాలుంటాయి. ఒకటి ప్రకృతి సహజమైనది, రెండోది మానవ కారకం. మాన వుల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణంలో మార్పులు కలగడం మొదలైంది 1850ల నుంచి అని శాస్త్రజ్ఞులు ఇన్నాళ్లుగా భావిస్తున్నారు. కానీ లీడ్స్, లాంకస్టర్ వర్సి టీల పరిశోధకులు.. ప్రాచీన మంచు ఫలకాలపై చిక్కు కుపోయిన వాయువులను విశ్లేషించి, మానవ కారక పర్యావరణ మార్పులు 1700 నుంచే ప్రారంభమైనట్టు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. 2015లో పారిస్ లో జరిగిన కాప్ 21 సదస్సులో సమావేశమైన ఐపీసీసీ లెక్కల ప్రకారం మానవుల వల్ల పెరిగిన Temperature ఉష్ణో గ్రతలు 1.31 డిగ్రీల సెల్సియస్ అయితే.. లీడ్స్, లాంక స్టర్ వర్సిటీ పరిశోధకుల లెక్కల ప్రకారం అది ఎప్పుడో దాటేశం.


వజ్రధూళితో భూతాపానికి చెక్!


కర్బన ఉద్గారాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలన్న అంశంపై శాస్త్రజ్ఞులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. జ్యూరిక్ (జర్మనీ)లోని ‘ఇన్స్టిట్యూట్ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ సైన్స్’ శాస్త్ర జ్ఞులు స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసాల్ ఇంజెక్షన్ (ఎస్ఏఐ)’ అనే విధానంపై రిసెర్చ్ చేశారు.

అర్థమయ్యే భాషలో చెప్పు కోవాలంటే. భూమిపై ఉండే స్ట్రాటో ఆవరణంలో రేణువులను వెదజల్లడం. అప్పుడు సూర్యకాంతి వాటిపై పడి ఎక్కువ భాగం పైకే ప్రతిఫలిస్తుంది. ఫలితంగా భానుడి తీక్షణత తగ్గి భూతాపం తగ్గుతుంది. ఇందుకు సల్ఫర్ డయాక్సైడ్ను ఉపయోగించాలనుకున్నారు. కానీ, దానివల్ల ఆమ్ల వర్షాలు కురిసే ముప్పండడం, ఓజోన్ పొర దెబ్బ తింటుందని తెలియడంతో. మరో ఆరు రకాల పదార్థాలపై దృష్టి సారించారు.

అవి.. వజ్రాల పొడి, క్యాల్సైట్, అల్యూమినియం, సిలికాన్ కార్బైడ్, అనటేజ్, రుటైల్. 45 ఏళ్లపాటు ఏటా స్ట్రాటో ఆవరణంలో ఈ పార్టికల్స్న వెద జల్లితే దేని ప్రభావం ఎలా ఉంటుందో కంప్యూటర్ నమూనాల ద్వారా విశ్లేషించి, చివరికి వజ్రధూకే అన్నింటికన్నా ఉత్తమం అని తేల్చారు. దానివల్ల భూతాపం 16 డిగ్రీల మేర తగ్గిపోతుందని వారి విశ్లేషణలో వెల్లడైంది. కానీ. దానికి అయ్యే ఖర్చు ఏకంగా ఏడాదికి 200 ట్రిలియన్ డాలర్లు. ఒక ట్రిలియన్ డాలర్ అంటేనే మన కరెన్సీలో దాదాపు రూ.84.4 లక్షల కోట్లు! ఇక 200 ట్రిలియన్ డాలర్లంటే ఎంత ఖర్చో ఊహించుకోండి!!


అగ్రదేశాలు డబ్బులిచ్చేనా?

కోపెన్హ్యాగన్ 2009లో జరిగిన కాప్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పారిశ్రామికీకరణతో లాభపడ్డ అమెరికా, ఐరోపా దేశాలు. కర్బన ఉద్గారా లను తగ్గించుకోవాలనుకునే దేశాలకు పదిహేనేళ్లపాటు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల సాయం చేయాల్సి ఉంది. కానీ, ఆ హామీని అవి నిలబెట్టుకోలేదు. 2020 నుంచి మొదలుపెట్టి నాలుగేళ్లు మాత్రమే ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో.. కిందటి నెలలో (నవంబరు 11-22 నడుమ) అజర్బైజాన్లోని బకులో జరిగిన కాప్-29 సదస్సులో ఇది ప్రధాన అంశంగా మారింది. ఏడాదికి 100 బిలియన్ డాలర్లు కాదని.. అభివృద్ధి చెందిన దేశాలు ‘క్లైమేట్ ఫైనాన్స్’ కింద ఏడాదికి లక్ష కోట్ల డాలర్ల చొప్పున ఇవ్వాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. కానీ.. చివరికి ఏటా 300 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.
అయితే.. 2015 నుంచి 24 నడుమ 100 బిలియన్ డాలర్లే ఇవ్వని దేశాలు 300 బిలియన్ డాలర్లు ఇస్తాయా? అన్నది.. ట్రిలియన్ డాలర్ల ప్రశ్న!!

Temperature 1.5 డిగ్రీల పరిమితి దాటితే?


భూతాపం 1.5 డిగ్రీల పరిమితి దాటితే సముద్ర ఉపరితల Temperature ఉష్ణోగ్రతలు పెరిగి కొన్నిరకాల సముద్ర జీవులు వేరే ప్రాంతాలకు వలసవెళ్లిపోతాయి. దీనివల్ల సముద్ర జీవావరణం దెబ్బతింటుంది. అలా వేరే ప్రాంతాలకు వలస వెళ్లలేని జీవులు, పగడపు దీవులు అంతరించిపోతాయి. పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని దీవులు మునిగిపోతాయి. సముద్ర పర్యావరణం దెబ్బతి నడంతో ఆహార సరఫరా శృంఖలానికి (ఫుడ్ సప్లై చైన్) విఘాతం కలుగుతుంది.

ధ్రువపు మంచు కరిగి సముద్రమట్టాలు పెరగడంతో తీరప్రాంతాలు మునిగి పోతాయి. వీటన్నింటివల్లా ఏడాదికి 11 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం.. కార్చిచ్చు ఘటనలు పెరిగి వాయుకాలుష్యం ప్రబలుతుంది. సమయం సందర్భం.. రుతువులతో సంబంధం లేకుండా.. వానలు కురుస్తాయి. కరువులు వేధిస్తాయి. ఫలితంగా పేదరికం పెచ్చరిల్లుతుంది